ఇయ్యాల టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్

ఇయ్యాల టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఎల్పీ మీటింగ్ కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్​లో జరగనుంది. మునుగోడు బై పోల్ రిజల్ట్, రాష్ట్రంలో బీజేపీ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గాలలో పెండింగ్ పనులపై ప్రతిపాదనలు అందజేసి, సాంక్షన్​లు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో  అమలవుతున్న స్కీంలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి చేపట్టాల్సిన చర్యలపై కేసీ ఆర్ చర్చించనున్నారు. మునుగోడులో 10వేలు మా త్రమే మెజార్టీ రావటంతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి అనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు. కమ్యూనిస్టులతో భవిష్యత్తులో పొత్తు కొనసాగింపుపైనా చర్చ లేవనెత్తనున్నారు. లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లలో ఎమ్మెల్యేలు త్యాగాలకు రెడీ కావాలని సీఎం సంకేతాలిచ్చే చాన్స్​ ఉంది. వచ్చే ఎండాకాలంలో కర్నాటక అసెంబ్లీతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగలాంటే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా చర్చించనున్నారు.