
కరీంనగర్ లో 986ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా.. తమ క్రమశిక్షణ తగ్గినట్టే అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఏన్నిక ఏకపక్షమే అన్నారు. ఎన్నిక ఏకగ్రీవం కాకూడదనే కళ్లుతోనే కొందరు నామినేషన్ వేశారని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ లోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో తమకు 986 ఓట్లు ఉన్నాయని, ఇందులో ఒక్క ఓటు కూడా తగ్గకుండా తమ అభ్యర్థులు ఇద్దరికి వస్తాయని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ప్రతి ఒక్కరు అంకితభావంతో ఉన్నారని, ఏ ఒక్క ఓటు కూడా క్రాసయ్యే అవకాశం లేదన్నారు గంగుల కమలాకర్.