మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 768 ఓట్లకు గాను.. 738 ఓట్లు పోలయ్యాయి.

నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి  917 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 1271 ఓట్లకు గాను 1233 ఓట్లు నమోదయ్యాయి.

మెదక్ లోనూ టీఆర్ఎస్ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ కు 585 ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 202 ఓట్లు వచ్చాయి.