
శ్రీనగర్ : నోట్ల కట్టలతో వెళ్తున్న ట్రక్కులో అనుకోకుండా మంటలు చెలరేగడంతో కోట్లాది రూపాయలు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటన జమ్మూలోని అనంతనాగ్ జిల్లా ఖాజిగంద్ ప్రాంతం ఆదివారం అర్ధరాత్రి జరిగింది. డబ్బును ఓటర్లకు పంచేందుకు సీక్రెట్ గా ట్రక్కులో తరలిస్తుండా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మంగళవారం జమ్మూలో మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.. ట్రక్కు నంబర్ ఆధారంగా విచారణ స్టార్ట్ చేస్తాం అన్నారు పోలీసులు.
