నేటి నుంచే బుకింగ్ప్ : రూ.799లకే ఫ్లైట్ టికెట్

నేటి నుంచే బుకింగ్ప్ : రూ.799లకే ఫ్లైట్ టికెట్

సర్జికల్ స్ట్రైక్-2తో విమాన టికెట్స్ ధరలు అమాంతం పెరిగాయి. అయితే సమ్మర్ సీజన్ రావడంతో మళ్లీ పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి విమాన సంస్థలు.  హైదరాబాద్‌ కు చెందిన ట్రూజెట్‌ విమాన సంస్థ ‘గ్రేట్‌ టేక్‌ ఆఫ్‌ సేల్‌’ పేరుతో ఆఫర్‌ ను ప్రకటించింది.

రూ.799 ప్రారంభ ధర (టాక్స్ ఎక్స్ ట్రా )తో లక్ష వరకు సీట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ టికెట్లను మార్చి 8వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 8వ తేదీ నుంచి అక్టోబరు 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. ఉడాన్‌ స్కీం కింద తమ వంతు సేవలు అందించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపింది ట్రూజెట్‌. వివరాలకు వెబ్ సైట్ చూడగలరు www.trujet.com