వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ మేరకు ఇమ్రాన్తో ట్రంప్ఫోన్లో మాట్లాడారు. కాశ్మీర్ అంశంపై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ క్లోజ్డోర్ మీటింగ్ తర్వాత ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. యూఎన్ఎస్సీ మీటింగ్ జరగడానికి ముందే ట్రంప్.. ఇమ్రాన్తో ఫోన్లో మాట్లాడారు.
చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని, జమ్మూకాశ్మీర్లో నెలకొన్న టెన్షన్లు సద్దుమణిగేలా చేయాలని ఇమ్రాన్కు ట్రంప్ సూచించినట్లు చెప్పింది. ‘‘అమెరికా, పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి, వాటిని ఎలా కొనసాగించాలనే దాని గురించి ఇటీవల వైట్హౌస్లో జరిగిన సమావేశంలో ట్రంప్, ఇమ్రాన్ చర్చించారు” అని వైట్హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే తెలిపారు.
