
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వార్ ముగిసినట్లేనని.. రెండు దేశాల మధ్య సీజ్ఫైర్కు చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను గంటపాటు ఫోన్లో మాట్లాడానని ఆయన సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘పుతిన్తో సంభాషణ చాలా బాగా జరిగింది. సీజ్ఫైర్ కోసం రష్యా, ఉక్రెయిన్ మధ్య వెంటనే చర్చలు ప్రారంభమవుతాయి. ఈ చర్చలతో యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడుతుంది” అని పేర్కొన్నారు.
పుతిన్తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లేయన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ ప్రధాని మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్తో కాన్ఫరన్స్ కాల్లో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు వెంటనే స్టార్ట్ అవుతాయని వారందరికీ తాను తెలియజేసినట్లు వివరించారు. ఈ చర్చలకు వాటికన్ సిటీ వేదిక అవుతుందని తెలిపారు. ‘‘రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధం ఇక ముగిసినట్లే. ఇక అమెరికాతో రష్యా, ఉక్రెయిన్ ట్రేడ్ డీల్ బలపడుతుంది. ఇది ఆ రెండు దేశాలకు, అక్కడి ప్రజలకు మంచి పరిణామం” అని ట్వీట్లో ట్రంప్పేర్కొన్నారు.