
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మాస్క్పెట్టుకోవడం విషయంలో పాజిటివ్గా మాట్లాడారు. ప్రెసిడెంట్ మార్క్ ఉన్న నల్లటి మాస్క్ను పెట్టుకున్న తన ఫొటోను ట్వీట్ చేశారు. ‘ నా కంటే గొప్ప దేశభక్తుడు లేడు” అంటూ ట్వీట్ చేశారు. యూఎస్లో కరోనాను కంట్రోల్ చేయడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ తన వ్యూహం మార్చారని, కరోనా వచ్చి పోతుంది అని చెప్పిన అతను ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకున్నారని నిపుణులు చెప్తున్నారు. కరోనా వచ్చి పోతుందని, అదేమీడేంజర్ కాదని ట్రంప్ మొదట్లో అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్కు నమ్మకమైన మద్దతుదారులు ఉన్న ఫ్లోరిడా,టెక్సాస్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతు దారుల కూడా ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నారని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఆయన సోమవారం నుంచి కరోనా వైరస్పై సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంట్లో భాగంగానే మాస్క్తో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. “ చాలా మంది మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెంసింగ్ పాటించడం దేశభక్తి అంటున్నారు. నాకన్నా ఎక్కువ ఎవరూ పెద్ద దేశ భక్తుడు కాదు. మీ ఫేవరెట్ ప్రెసిడెంట్” అని ట్రంప్ ట్వీట్ చేశారు. పబ్లిక్ప్లేసుల్లో అందరూ కచ్చితంగా మాస్క్ వేసుకోవాలని చెప్పకనే చెప్పారు. మరో 100 రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.