రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం

రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం

సీబీఐ విచారణ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు నో చెప్పింది.  సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సీబీఐకి అనుమతులు రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. నిన్న బీజేపీ పిటిషన్ విచారణ సమయంలో.. కోర్టుకు సబ్ మిట్ చేసిన రిపోర్ట్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆగస్ట్ 30.. 2022న జీవో 51 ఇచ్చినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.

అయితే ఇన్నిరోజులు జీవో నెంబర్ 51ను రహస్యంగా ఉంచింది సర్కార్. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లోనూ జీవో కనబడకుండా బ్లాక్ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది. మూడేళ్ల కిందట ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.