బక్రీద్ సందర్భంగా జంతు వధపై హైకోర్టు విచారణ

బక్రీద్ సందర్భంగా జంతు వధపై హైకోర్టు విచారణ

బక్రీద్ సందర్భంగా జంతువధపై జూన్ 28తేదీన బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటోను ధర్మాసనం పిల్‌గా అంగీకరించింది. మతపరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. అయితే జంతువధపై చర్యలు తీసుకోవాలని బక్రీద్‌కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదని హైకోర్టు తెలిపింది. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో హైకోర్టును లాగితే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. 

గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని న్యాయస్థానానికి ఏజీ ప్రసాద్ తెలిపారు. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వివరించింది. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని హైకోర్టు కోరింది. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.