‘ధరణి’లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

‘ధరణి’లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

హైద‌రాబాద్: ధరణి పోర్టల్ లో  వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గ‌తంలో ఇచ్చిన‌ స్టే ను జూన్ 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిపై దాఖలైన ఏడు పిల్స్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేప‌ట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదని, ధరణిపై 2 పిల్స్ పై మాత్రమే విచారణ జరుపుతామన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. మరో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. ధరణి పై అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని, ప్రభుత్వం వైఖరి తెలిపేందుకు సమయం కావాలని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. దీనిప‌నై స్పందించిన ధ‌ర్మాసనం గ‌తంలో ఇచ్చిన స్టే ను జూన్ 21 వ‌ర‌కూ పొడిగిస్తూ విచార‌ణ వాయిదా వేసింది.