రీవెరిఫై మాత్రమే చేశాం..మళ్లీ దిద్దలేదు:ఇంటర్ బోర్డ్

రీవెరిఫై మాత్రమే చేశాం..మళ్లీ దిద్దలేదు:ఇంటర్ బోర్డ్

హైదరాబాద్​, వెలుగు: సున్నా మార్కులు వచ్చిన ఆన్సర్​షీట్లు, అసలు దిద్దని పేపర్లను రీవెరిఫై మాత్రమే చేశామని, మళ్లీ దిద్దలేదని ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్​బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి దిద్దిన పేపర్లను మళ్లీ దిద్దడం కుదరదని, విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని గమనించాలని చెప్పారు. మొత్తం మార్కులను సరిచేశామన్నారు.

మ్యాథ్స్​ విద్యార్థులూ.. టెన్షన్​ వద్దు

ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు లెక్కల పరీక్షలో 75 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇస్తామని, పాస్​ మార్కులు 26 అని అశోక్​బాబు చెప్పారు. ఎంఈసీ విద్యార్థులు 75 మార్కులకే పరీక్ష రాసినా, మెమోలో ఆ మార్కులను 50 శాతానికి తగ్గించి ప్రింట్​ చేస్తామన్నారు. అసలు మార్కులను 2/3తో లెక్కించి మార్కులేస్తామన్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి 75 మార్కులకు 18 వస్తే.. ఆ వచ్చిన మార్కులను 18 x 2/3 =12గా లెక్కిస్తామన్నారు. కాబట్టి పేపర్లో వచ్చిన మార్కులు, మెమోలో ప్రింటైన మార్కులను చూసి ఆందోళన చెందొద్దని సూచించారు. రీవెరిఫికేషన్​లో పాసైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్​ పరీక్ష కోసం సబ్జెక్టుకు ₹150 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేపర్లను రీవాల్యుయేషన్​ చేస్తే మరింత మంది పాసై
ఉండేవారని తల్లిదండ్రుల సంఘం పేర్కొంది. అసలు సమస్యను అశోక్​బాబు విస్మరించారని పేర్కొంది.