హైదరాబాద్/వికారాబాద్, వెలుగు : హైదరాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో అధికారులు పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 921 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి 1,88,779 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాయనున్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు, పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. హాల్టికెట్లు అందనివారు www.bse.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30వరకు ఎగ్జామ్స్జరగనుండగా, 5 నిమిషాల గ్రేస్ పిరియడ్ ఇచ్చారు. 9:35 వరకు విద్యార్థులను ఎగ్జామ్హాల్లోకి అనుమతిస్తారు.