
సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టెట్ కన్వీనర్ రాధారెడ్డి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
TS-TET పరీక్షను మొత్తం 33 జిల్లాల్లో నిర్వహిస్తున్నామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. రెండు సెషన్లలో టెట్ పరీక్ష జరుగుతుందన్నారు. పేపర్- I ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు...పేపర్- II మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2052 కేంద్రాల్లో టెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కు4 లక్షల78వేల 55 మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేశారు. పేపర్-1 2లక్షల69వేల557 మంది.. పేపర్-II 2 లక్షల 84వేల 98 మంది అభ్యర్థులు రాసే అవకాశం ఉందని తెలిపారు.
టెట్ నిర్వహణ కోసం2 వేల 52 మంది చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, 2052 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. టెట్ నిర్వహణకు 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. టెట్ పరీక్షా కేంద్రాల్లో ANM ల తో పాటు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అదేశాలు జారీ చేశామని రాధారెడ్డి తెలిపారు. టెట్ నిర్వహణకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టెట్ అభ్యర్థులకు సూచనలు..
- అభ్యర్థులుపేరులో అక్షర దోషాలు చూసుకోవాలి.
- ఒక వేళ ఏమైనా తప్పులు ఉంటే.. పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకునే అవకాశం.
- హాల్టికెట్పై ఫొటో, సంతకం సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. లేకపోతే అభ్యర్థుల తాజా ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో సంతకం తీసుకోవాల్సి ఉంటుంది.
- గెజిటెడ్ అటెస్టేషన్ ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతి.
- గంటే ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- టెట్ లో ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమలు చేయనున్న అధికారులు.
- పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను..అభ్యర్థులనుఅనుమతించరు.
- రెండు సేషన్ల పరీక్ష పూర్తి అయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
- ఒక వేళ అభ్యర్థులు ఎవరైనా ముందుగానే బయటకు వస్తే.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు.
- ఎలక్ట్రానిక్ పరికరాలు..రిమోట్ తో కూడిన కారు తాళాలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు.
- ఓఎంఆర్ షీట్లో బ్లూ..బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుంది.
- హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదు.
- పరీక్ష రాసే ముందు OMR ఆన్సర్ షీట్ సైడ్లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి అనుసరించాలి.
- మీకు ఇచ్చిన ప్రశ్నాపత్రం మీరు ఎంచుకున్న భాషలో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా లేకపోతే వెంటనే ఇన్విజిలేటర్ చెప్పాలన్న అధికారులు.