పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : బి.రాజు

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి : బి.రాజు

ములకలపల్లి, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు  పిలుపునిచ్చారు. ఈ విషయమై టీఎస్  యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహించారు. ఆదివారం సీతారాంపురం, పాతూరు, సుబ్బనపల్లి, పూసుగూడెం, మధారం, ములకలపల్లి, జగన్నాథపురం, కొత్త గంగారాం, పాతగంగారంలో ప్లాంప్లేట్స్​ పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో అనుభవం కలిగిన టీచర్లు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉంటాయన్నారు.

 ప్రభుత్వం విద్యార్థులకు ఉచితం పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్  అందించి, నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెడుతుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షురాలు వి.వరలక్ష్మి, జిల్లా అడిట్ కమిటీ సభ్యుడు ఎం.రాజేశ్వరరావు, జిల్లా సినీయర్ నాయకుడు గరికె శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు యం కిషోర్, కె శ్రీరామ్, కె.శ్రీనివాసు. సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు, రైతు సంఘం నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.