జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ కాలేజీల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం16 సబ్జెక్టులకు  సంబంధించి 1,392 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు  స్వీకరణ, జూన్​ లేదా జులైలో పరీక్షలుంటాయని చెప్పింది. శుక్రవారం టీఎస్​పీఎస్సీ ఆఫీసులో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఎల్​ పోస్టుల భర్తీపై చర్చించి, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మల్టీజోన్​1 పరిధిలో 724, మల్టీజోన్ 2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయని ప్రకటించారు.

ఈ ఏడాది జులై 22న ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్​పరిధిలో 1,523 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు కాగా, 91 ఫిజికల్ డైరెక్టర్, 40 లైబ్రేరియన్ పోస్టులున్నాయి. ఇక ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2008లో 1,100 జేఎల్​ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రంలో జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి.