RTC బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి..పలువురికి తీవ్ర గాయాలు

RTC బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి..పలువురికి తీవ్ర గాయాలు

AP కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం తోటచర్ల దగ్గర TSRTC బస్సు బోల్తా పడింది. జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో RTC బస్సు డ్రైవర్ సహా కండక్టర్ చనిపోయారు. ఘటనలో మరో 8 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నందిగామ హాస్పిటల్ కు తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది అని ప్రయాణీకులు చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బ్రేకులు వేయడం… రాష్ డ్రైవింగ్ తోనే బస్సు మూడు పల్టీలు కొట్టింది అని అన్నారు.