ఈ మధ్య దొంగలు ఏది వదలడం లేదు. దొరికిందల్ల ఎత్తుకెళ్తున్నారు. బంగారం, డబ్బు, సెల్ ఫోన్లే కాదు ఆర్టీసీ బస్సులను ఎత్తుకెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం సెస్టెంబర్ 11న సిద్దిపేట బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సును చోరీ చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సును ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్ కు షాకిచ్చాడు. అయితే బస్సును జిల్లెళ్ల క్రాసింగ్ వద్దకు తీసుకురాగానే రోడ్డుపై నుంచి గుంతలోకి తీసుకెళ్లాడు. లేటెస్ట్ గా అలాంటి ఘటనే హైదరాబాద్ లో మరొకటి జరిగింది.
అక్టోబర్ 30వ తేదీ సోమవారం రాత్రి నగరంలోని మెహదీపట్నం బస్ డిపో ముందు ఆగి ఉన్న టిఎస్ఆర్టిసి బస్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్రైవర్ సోమవారం రాత్రి సుమారు 10.30 గంటలకు మెహిదీపట్నం బస్ డిపో ముందు వాహనాన్ని పార్క్ చేసి వెళ్లిపోయాడు. ఉదయం తిరిగి వచ్చేసరికి బస్సు పోయిందని డ్రైవర్ గుర్తించాడు. చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి డిపోలో కూడా విచారించిన తర్వాత డ్రైవర్ ఆసిఫ్నగర్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణ అనంతరం తుండపల్లి, శంషాబాద్లో పోలీసులు బస్సును గుర్తించారు.