హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన 50 శాతం బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్అండ్వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్చేసింది. 5 సంవత్సరాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పి గతంలో 8.75 శాతం వడ్డీతో బాండ్లు ఇచ్చారని, 2020తో గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని తెలిపింది.
సీఎం రేవంత్రెడ్డి బాండ్ల పైసలకు సంబంధించి రూ.281 కోట్ల చెక్ ఇచ్చి నెలరోజులు దాటినా, ఇంతవరకు డబ్బు జమ చేయలేదని యూనియన్ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, సెక్రటరీ జనరల్హన్మంత్ముదిరాజ్, అబ్రహం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల్లో చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
