ఆదాయం పెంచుకునే పనిలో ఆర్టీసీ.. దేవాలయాలు, టూరిజం స్థలాలను కలుపుతూ టూర్ ప్యాకేజీలపై దృష్టి

ఆదాయం పెంచుకునే పనిలో ఆర్టీసీ.. దేవాలయాలు, టూరిజం స్థలాలను కలుపుతూ టూర్ ప్యాకేజీలపై దృష్టి

హైదరాబాద్, వెలుగు: ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ దేవాలయాలు, టూరిజం స్థలాలను ప్రయాణికులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్థానికంగా ఉన్న ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను చుట్టివచ్చేలా ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అమలు చేసే అధికారాన్ని స్థానికంగా ఉన్న రీజియన్ మేనేజర్లకు యాజమాన్యం ఇచ్చింది.

గతంలో హైదరాబాద్ దర్శినీ, సింగరేణి దర్శినీ వంటి టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేసిన ఆర్టీసీ, ఆ తర్వాత వీటిని రద్దు చేసింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో దాదాపుగా చాలా డిపోల్లో అరుణాచలం టూర్ ప్యాకేజీ మాత్రమే అమలవుతోంది. ప్రతి సోమవారం భక్తులు ఎక్కువగా శివాలయాలకు వెళ్తుంటారు. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తే ఆర్టీసీకి ఆదాయం ఎలా ఉంటుందనే దానిపై అధికారులు స్టడీ చేస్తున్నారు.