హైదరాబాద్, వెలుగు: సీసీఎస్కు ఇవ్వాల్సిన అసలు, వడ్డీ బకాయిలు రూ.1,049 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కు సీసీఎస్ (క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ) మేనే జింగ్కమిటీ నేతలు యాదగిరి, లక్ష్మయ్య శనివారం లేఖ రాశారు. గత నాలుగేండ్లుగా ప్రతి ఆర్టీసీ కార్మికుడి జీతం నుంచి 7 శాతం సీసీఎస్ అమౌంట్ కట్ చేసి ఆర్టీసీ ఉపయోగిం చుకుంటున్నదని, వాటిని సీసీఎస్కు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిసి రూ.1,049 కోట్లకు చేరాయని లేఖలో కమిటీ నేతలు వివరించారు.
దీంతో గత రెండేండ్లుగా కార్మి కులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, ఏడు వేల లోన్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్లు, ఇళ్ల నిర్మాణం, హాస్పిటల్ ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర ఆర్టీసీ కార్మికులు అప్పులు చేస్తున్నారని తెలిపారు.