బకాయిలు వెయ్యి కోట్లివ్వండి.. ఆర్టీసీ చైర్మన్​కి సీసీఎస్ బోర్డు లేఖ

బకాయిలు వెయ్యి కోట్లివ్వండి.. ఆర్టీసీ చైర్మన్​కి సీసీఎస్ బోర్డు లేఖ

హైదరాబాద్, వెలుగు: సీసీఎస్​కు ఇవ్వాల్సిన అసలు, వడ్డీ బకాయిలు రూ.1,049 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​కు సీసీఎస్ (క్రెడిట్ కోఆపరేటివ్  సొసైటీ)  మేనే జింగ్​కమిటీ నేతలు యాదగిరి, లక్ష్మయ్య శనివారం లేఖ రాశారు. గత నాలుగేండ్లుగా ప్రతి ఆర్టీసీ కార్మికుడి జీతం నుంచి 7 శాతం సీసీఎస్​ అమౌంట్ కట్ చేసి ఆర్టీసీ ఉపయోగిం చుకుంటున్నదని, వాటిని సీసీఎస్​కు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిసి రూ.1,049 కోట్లకు చేరాయని లేఖలో కమిటీ నేతలు వివరించారు. 

దీంతో గత రెండేండ్లుగా కార్మి కులకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, ఏడు వేల లోన్ అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయన్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్లు, ఇళ్ల నిర్మాణం, హాస్పిటల్ ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర ఆర్టీసీ కార్మికులు అప్పులు చేస్తున్నారని తెలిపారు.