
హైదరాబాద్, వెలుగు: పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ (డైలీపాస్)ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. రూరల్, సిటీ ప్రయాణికుల సౌకర్యార్థం ‘టి-9 టికెట్’ ప్రవేశపెట్టింది. శుక్రవారం బస్ భవన్ లో ‘టి-9 టికెట్’ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు లాంచ్ చేశారు.
ఆదివారం నుంచి ఈ టికెట్ అమల్లోకి రానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని సజ్జనార్ తెలిపారు. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానుపోను ప్రయాణం చేయొచ్చన్నారు. ‘టి-9 టికెట్’ ధర రూ.100గా నిర్ణయించారు. సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టికెట్ పొందవచ్చని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారని వివరించారు.