
తిరుమల తిరుపతి దేవస్థానం 2020-21 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 3 వేల 3వందల 9 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది పాలక మండలి. తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్ పై చర్చించారు. గతేడాదితో పోల్చితే బడ్జెట్ అంచనాలు 66 కోట్లు పెరిగింది. హుండీ ద్వారా 1351 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా 400 కోట్లు, వడ్డీల ద్వారా 706 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. బూందీపోటులో అగ్ని ప్రమాదాల నివారణకు 3కోట్ల 30లక్షల్లతో థర్మో ఫ్లూయిడ్ స్టవ్ ల ఏర్పాటు, జూపార్క్ దగ్గర 14 కోట్ల రూపాయలతో ప్రతిభా వంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ టీటీడీ టెంపుల్ దగ్గర పుష్కరిణి, కల్యాణ మండపం, వాహన మండప నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి 3.3 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు 8.5 కోట్లు కేటాయించింది.