రూ.10 వేలకు వీఐపీ దర్శనం నిజం కాదు: టీటీడీ

రూ.10 వేలకు వీఐపీ దర్శనం నిజం కాదు: టీటీడీ

ప్రముఖులకు మాత్రమే పరిమితమైన శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం…సామాన్యులకు కేటాయించనుందని వస్తున్న వార్తలపై స్పందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. TTD శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం కల్పించాలని TTD ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్  చెప్పినట్లుగా శనివారం ఒక పేపర్ వార్త వచ్చిందని…అది నిజం కాదని తెలిపింది. ఇలాంటి విధానపరమైన నిర్ణయాలను TTD ధర్మకర్తల మండలిలో చర్చించిన తర్వాత బోర్డు ప్రకటిస్తుందని చెప్పింది.