
డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శన కోటాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది టీటీడీ. డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, గదుల కోటాను గురువారం ( సెప్టెంబర్ 18 ) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.ఈ- సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది టీటీడీ. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.
ఈ టికెట్లు పొందినవారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయని తెలిపారు అధికారులు. సెప్టెంబర్ 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనున్నట్లు తెలిపారు.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయను టీటీడీ.
వర్చువల్ సేవల కోటా విడుదల:
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు అధికారులు.
శ్రీవాణి దర్శన కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా:
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు అధికారులు.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల:
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
గదుల కోటా విడుదల:
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు అధికారులు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని.. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు అధికారులు.