ఇలా ఉన్నారేంట్రా బాబు.. పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ హైజాక్..

ఇలా ఉన్నారేంట్రా బాబు.. పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ హైజాక్..

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. పసుపు లోడ్ తో వెళ్తున్న లారీని కేటుగాళ్లు హైజాక్ చేశారు. రూ. 50లక్షల విలువైన పసుపు లోడ్ తో గుంటూరు వెళ్తున్న లారీని ఆర్టీఏ అధికారుల పేరుతో దుండగులు అడ్డుకున్నారు. డ్రైవర్ కు మత్తు ఇచ్చి లారీని హైజాక్ చేశారు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు. 

నవిపేట్ మండలం జన్నేపల్లి వద్ద ఇతర వాహనాల్లో పసుపు నింపుతుండగ పోలీసులు లారీని గుర్తించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే  దుండగుల పరారయ్యారు. కిరాయికి వెళ్లిన వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.