సికింద్రాబాద్ దోపిడీ కేసులో ట్విస్టులు.. దొంగలను కొట్టిన గజదొంగలు.. చివరికి గోవాలో..

సికింద్రాబాద్ దోపిడీ కేసులో ట్విస్టులు.. దొంగలను కొట్టిన గజదొంగలు.. చివరికి గోవాలో..

పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోషమమ్మ కొట్టిందనే సామెత వినే ఉంటారు.. ఇక్కడ సేమ్ అలాంటి సీనే రిపీట్ అయ్యింది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని కొట్టేసిన డబ్బును.. గజదొంగలు కొట్టేసి.. ఎంచక్కా పంచుకుని గోవా చెక్కేశారు. గోవాలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. గత వారం (2025, జూన్ 2వ వారం) తక్కువ రేట్ లో బంగారం ఇప్పిస్తామని వ్యాపారికి వల వేశారు మధ్యవర్తులు. 20 మంది టీం గా ఏర్పడి వ్యాపారిని బురిడీ కొట్టించారు.  పక్కా ప్రాణాలీకతో.. తాము SOT పోలీసులని.. తక్కువ ధరకేం బంగారం ఇప్పిస్తామని చెప్పారు. దీంతో రూ.50 లక్షలకు పైగా డబ్బును బ్యాగులో పెట్టి అప్పగించాడు వ్యాపారి. కచ్చితంగా బంగారం ఇప్పించాలని చెప్పగా.. చీప్ ధరలకే బంగారం ఇప్పిస్తామని  చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయారు.

ఇక్కడే మరో ట్విస్ట్ బయపడింది. వ్యాపారి నుంచి తీసుకున్న డబ్బు బ్యాగ్ ను బైక్ పై తీసుకుని వెళ్లింది రాంబాబు టీం. అయితే రాంబాబు ను జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర బైక్ రికవరీ ఏజెంట్లు ఆపారు.  బైక్ ఫైనాన్స్ లో ఉంది అంటూ చెకింగ్ చేశారు.  బ్యాగ్ లో భారీగా డబ్బు ఉండడం చూసి వారిని బెదిరించి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయారు బైక్ రికవరీ ఏజెంట్స్.

అనుకోకుండా వరం ఇచ్చినట్లు వచ్చి పడిన డబ్బును పంచుకుని ఎంచక్కా గోవా వెళ్లిపోయారు. అక్కడ చేయాల్సి ఎంజాయ్ చేస్తూ కావాల్సిన సరదాలు తీర్చుకున్నారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. వ్యాపారి ఫిర్యాదుతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ గోవాలో ఉన్న బైక్ రికవరీ ఏజెంట్లను పట్టుకున్నారు. అక్కడ16 మందిని అరెస్ట్ చేసి రూ.43 లక్షల తోపాటు 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.