
ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ఛార్జిషీట్లో కవిత పేరును చేర్చడంపై ఆమె వివరణ ఇచ్చారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కవిత ట్వీట్ పై రాజగోపాల్ రెడ్డి కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. "నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. నువ్వు లిక్కర్ స్కామ్లో ఉన్నది నిజం. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం" అని రాజగోపాల్ రెడ్డి గట్టిగానే బదులిచ్చారు.
అంతకుముందు.. రాజగోపాల్ కవిత పేరును ఛార్జ్షీట్లో 28 సార్లు ప్రస్తావించారంటూ అనిఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. " రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు. 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు. ట్రూత్ విల్ ప్రివెయిల్" అని కవిత కౌంటర్ ఇచ్చారు.