జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి, సీఎంకు టీడబ్ల్యూజేఎఫ్ వినతి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి, సీఎంకు టీడబ్ల్యూజేఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ కోరింది. శనివారం హైదరాబాద్ లోని సెక్రటేరియెట్ లో  సీఎం రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, కార్యదర్శులు సలీమ, జగదీశ్వర్, చంద్రశేఖర్ కలిశారు. జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందిస్తూ..ఎన్నికల తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.