
వికారాబాద్, వెలుగు: ఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు వికారాబాద్ పట్టణంలో పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇంచార్జ్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. ధన్నారం గ్రామానికి చెందిన లాల్ మహమ్మద్, శివారెడ్డి పేటకు చెందిన అబ్దుల్ జబ్బార్లు ఆన్లైన్ మట్కా ఆడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకుని వారి నుంచి 9 వేల 960 రూపాయలు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.