కరెంట్ షాక్ తో పాడిగేదెలు మృతి

కరెంట్ షాక్ తో పాడిగేదెలు మృతి

యాదాద్రి భువనగిరి : కరెంట్ షాక్ తగిలి రెండు గేదెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం యాదగిరిగుట్ట మండలం రామాజిపేటలో జరిగింది. రైతు సూదాగాని శ్రీనుకు చెందిన గేదెలు గడ్డి మేస్తుండగా.. కరెంటు తీగలు తెగిపోవడంతో  ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు గ్రామస్థులు. పాడి గేదెలతోనే రైతు జీవనోపాధి కొనసాగించేవాడు. ఆకస్మాత్తుగా రూ.2 లక్షల విలువైన గేదెలు చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు రైతు.

విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. అధికారులు స్పందించి గేదెల రైతును ఆదుకోవాలని తెలిపారు గ్రామస్థులు. బర్రెలను మేపుతున్న రైతు కూతురుకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు.