మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఉదంపూర్- దుర్గ్ ఎక్స్ప్రెస్ బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. ప్రయాణికులను ఖాళీ చేయడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధంపూర్ దుర్గ్- ఎక్స్ప్రెస్.. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నుండి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళుతోంది. రైలు మొరెనాలోని హేతంపూర్ రైల్లే స్టేషన్ నుండి బయలుదేరిన కాసేపటికే మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే పోలీసులు, అధికారులు దెబ్బతిన్న బోగీలను వేరుచేశారు.
Morena, Madhya Pradesh | Udhampur-Durg Express's A1 & A2 coaches reported fire due to unknown reasons after leaving the Hetampur Railway Station; no casualties were reported & passengers have been evacuated: Dr Shivam Sharma, CPRO/NCR
— ANI (@ANI) November 26, 2021
(Video Courtesy: Unverified Source) pic.twitter.com/xzRnk7Xja2