ఉదంపూర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో మంటలు..

 ఉదంపూర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో  మంటలు..

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఉదంపూర్- దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. రెండు బోగీలు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. ప్రయాణికులను ఖాళీ చేయడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధంపూర్ దుర్గ్- ఎక్స్‌ప్రెస్..  జమ్మూ  కాశ్మీర్‌లోని ఉదంపూర్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళుతోంది. రైలు మొరెనాలోని హేతంపూర్  రైల్లే స్టేషన్ నుండి బయలుదేరిన  కాసేపటికే మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే పోలీసులు, అధికారులు  దెబ్బతిన్న బోగీలను వేరుచేశారు.