అన్నదమ్ములను కలిపిన బలగం సినిమా

 అన్నదమ్ములను కలిపిన బలగం సినిమా

భూమి తగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం చిత్రం కలిపింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి ఓ స్థలం వివాదంలో గొడవపడి చాలా కాలం క్రితం విడిపోయారు. అయితే ఇటీవల వారి గ్రామానికి చెందిన సర్పంచ్‌ సురకంటి ముత్యంరెడ్డి చొరవతో మండల కేంద్రంలోని డీఎన్‌ఆర్‌ ఫంక్షనల్‌ హాల్‌లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పోసులు, రవి తమ మనసును మార్చుకున్నారు. 

తమ మనస్పర్థాలు పక్కనపె ట్టామని, ఇకనుంచీ కలిసే ఉంటామని ఆదివారం ఉదయం సర్పంచ్‌ ముత్యంరెడ్డి సమక్షంలో ఒక్కటయ్యారు. వివాదంలో ఉన్న భూమి సమస్యను పరిష్కరించుకున్నారు. తమను కలిపిన గ్రామ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదమ్ముల్లో మార్పు రావడం చూసి గ్రామ సర్పంచ్‌ బలగం సినిమా చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దూరమైపోతున్న మానవ సంబంధాలను కథగా మార్చుకొని తీసిన బలగం చిత్రాన్ని చూసి చాలా మంది ప్రేక్షకులు విడిపోయిన తమ కుటుంబ సభ్యులను, బంధువులను కలుసుకుంటున్నారు. 
 

https://www.youtube.com/watch?v=KrFZojVI69g