సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు) ఆడుకునేందుకు వెళ్లి కనిపించకుండా పోయారు. తమ పిల్లలు యశ్వంత్(12), దేవిశ్రీప్రసాద్(08) కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు బొల్లారం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.