ఏపీలో కొత్తగా 351 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 351 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే 351 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఏడు వేల మార్కును దాటింది. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున చనిపోగా.. మొత్తం కరోనా మరణాలు 90 కి చేరుకున్నట్లు ప్రకటించింది. తాజా కేసుల్లో 275 మంది స్థానికులు కాగా 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి, 26 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినవారికి చెందినవని బులిటెన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7071 కి పెరిగినట్లు పేర్కొంది. కేవలం నాలుగు రోజుల్లోనే వెయ్యి కేసులు పెరిగాయి. ఇప్పటివరకు 3,641 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 3,340 మంది ట్రీట్​మెంట్ పొందుతున్నారు.