
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తాతామనవడు ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
అసలేం జరిగిందంటే.? మనవడు శయంక్ (4)కు కుక్క కరిచిందని చికిత్స కోసం తాత సిద్ధిరాములు(50), బస్వన్నపల్లి నుంచి రాజంపేట ప్రాథమిక సెంటర్ కు బైక్ పై తీసుకెళ్తుండగా రాజంపేట మండల కేంద్ర సమీపంలో బైక్ అర్టీసీ బస్ ఢీకొట్టింది. బస్సు, బైక్ పైకి దూసుకెళ్లడంతో బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది.
దీంతో బైక్ పై ఉన్న సిద్ధిరాములు నాలుగేళ్ల మనవడు శయాంక్ ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు . సంఘటన స్థలానికి వచ్చిన రాజంపేనట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తాతామనవళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.