తెలంగాణలో ఇద్దరు డీఈల సస్పెన్షన్..

తెలంగాణలో ఇద్దరు డీఈల సస్పెన్షన్..

 తెలంగాణలో ఇద్దరు విద్యుత్ ఉన్నదాధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు విద్యుత్ డీఈలను సస్పెండ్ చేస్తున్నట్టు విద్యుత్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. గచ్చిబౌలి  డీఈ గోపాల కృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. గచ్చిబౌలి డీఈ గోపాల కృష్ణ పై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో డీఈ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు సీఎండీ గుర్తించారు. ఎల్సీలు తీసుకోవడం నిరంతర విద్యుత్ సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందుకే సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ సిటీ, నల్గొండ ఎస్ఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.