స్వదేశంలో బిజినెస్ చేద్దామనుకున్నారు.. మృత్యువు కారు రూపంలో..!

స్వదేశంలో బిజినెస్ చేద్దామనుకున్నారు.. మృత్యువు కారు రూపంలో..!

హైదరాబాద్: కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన కార్ఖానా ప్రధాన రహదారిలో జరిగింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా వచ్చిన కారు బలంగా విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. జూబ్లీహిల్స నుంచి కుషాయిగూడకు వెళ్తుండగా కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతులు సాయి కిరణ్ రెడ్డి, సోహైల్ గా గుర్తించిన పోలీసులు.. వీరు ఇటీవలే లండన్ లో ఎంఎస్ చేసి స్వదేశానికి తిరిగి వచ్చారని.. ఇండియాలోనే బిజినెస్ పెట్టుకుని తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకున్నారని.. కానీ ఇంతలోనే ప్రమాదంలో చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.