వాహనం టైర్ పేలి ఇద్దరు మృతి

వాహనం టైర్ పేలి ఇద్దరు మృతి

హైదరాబాద్ నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఐడీఏ నుంచి బొల్లారంకు కూలీలతో వస్తున్న వాహానం వెనుక టైరు ఒక్కసారిగా పగలడంతో అదుపు తప్పి డివైడర్ ను  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మరణించారు. మరణించిన వారు భార్యాభర్తలుగా తెలిసింది. స్థానికుల సమాచారంలో పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.