దక్షిణ కొరియా సినిమాలు, వీడియోలు చూశారన్న ఆరోపణలతో ఉత్తర కొరియా ప్రభుత్వం ఇద్దరు విద్యార్ధులకు మరణశిక్ష విధించింది. రెండు నెలల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల సంస్కృతి తమ దేశ పౌరులపై పడకూడదన్న ఉద్దేశంతో టీవీ, దుస్తులు, హెయిర్స్టైల్ వంటి వాటిపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలోని ర్యాంగాంగ్ ప్రావిన్స్ ప్రాంతం చైనా సరిహద్దులో ఉండే ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అక్టోబరు నెలలో దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ డ్రామాలు చూశారని ఆరోపిస్తూ కొరియా అధికారులు వారిపై నేరారోపణ చేశారు. ఈ విషయాన్ని ది ఇండిపెండెంట్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీంతో చట్టాలను అతిక్రమించిన ఆ విద్యార్థులను మరణశిక్ష విధించి, బహిరంగంగా కాల్చి చంపినట్లు వెల్లడించింది.