రిటైర్డ్ అయిన అటెండర్ నుంచి లంచం డిమాండ్.. ఇద్దరిపై కేసు

రిటైర్డ్ అయిన అటెండర్ నుంచి లంచం డిమాండ్.. ఇద్దరిపై కేసు

రిటైర్డ్ అయిన అటెండర్ వద్ద లంచం తీసుకంటూ ఏసీబీకి చిక్కారు జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు.జిల్లా  కేంద్రంలోని ఎస్సీ డెవలప్ మెంట్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఎస్సీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గట్టు మల్లు, సూపరిండెంట్  కదీరొద్దీన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గత ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ పొందిన అటెండర్ ఐలయ్య జీతభత్యాలకు సంబంధించిన ఫైళ్లను పూర్తి చేయాలని కోరగా రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. రూ.10 వేలు లంచం ఇస్తే పని చేసి పెడతామని ఆ అధికారులు డిమాండ్ చేయడంతో..  ఐలయ్య ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం రూ.5వేలు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two officers were caught by the ACB while taking a bribe from a retired attender