చందానగర్, వెలుగు: స్కూల్కు వెళుతున్నామని చెప్పి ఇద్దరు స్టూడెంట్స్ తాము ఉంటున్న చిల్డ్రన్ హోం నుంచి బయటకు వెళ్లి మిస్సింగ్ అయినా సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి ఎంఐజీ కాలనీలో ఎస్ఓఎస్ చిల్ర్డన్ యూత్ హౌస్ ఉంది. ఇందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తారు. ఇదే హౌస్లో ఉంటున్న యు. రాజేశ్ (17), జగన్(14) బీహెచ్ఈఎల్ ప్రభుత్వ పాఠశాలలో 9, 8 తరగతులు చదువుతున్నారు. ఈ నెల 13న ఇద్దరు స్కూల్కు వెళుతున్నామని 8.30 గంటలకు హౌస్ నుంచి బయటకు వచ్చారు.
తిరిగి సాయంత్రం రాలేదు. స్థానికంగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్కూల్ పిల్లలను ఆరా తీయగా, 13వ తేదీన రాజేశ్, జగన్ స్కూల్కు రాలేదని తెలిపారు. అదే రోజు ఉదయం ఇద్దరు కలిసి గుర్తు తెలియని వ్యక్తులను లిఫ్ట్ అడిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ మేరకు చందానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
