ఇద్దరు స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు

 ఇద్దరు స్టూడెంట్లకు ఇద్దరు టీచర్లు

అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నెమలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్టూడెంట్లు చదువుకొంటుండగా, వారి కోసం ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు ఓ వంట మనిషి కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్​కోసం నెలకు రూ.లక్ష పైగా ఖర్చు చేస్తోంది.

నెమలిపేట బడిలో గతేడాది 10 మంది స్టూడెంట్లు ఉండగా, 8 మంది 5వ తరగతి పూర్తిచేసి హైస్కూల్​కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక బాలిక, బాలుడు ఉన్నారు. మూడు, నాలుగో తరగతి చదువుతున్నారు. కొన్నాళ్ల కింద ఇక్కడి టీచర్లలో ఒకరు డిప్యూటేషన్​పై అనంతారం వెళ్లారు. ప్రస్తుతం ఒక టీచర్.. ఇద్దరు స్టూడెంట్లకు పాఠాలు చెబుతున్నారు. మారుమూల గ్రామం కావడంతో ఇక్కడి స్కూలుకు స్టూడెంట్లు రావడం లేదు.