సరస్సులో పడి చనిపోయిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ సిబ్బంది

సరస్సులో పడి చనిపోయిన ఇద్దరు ట్రైనీ ఆర్మీ సిబ్బంది

జార్ఖండ్‌లోని ఎస్‌ఆర్‌సి క్యాంపస్‌లో ఘోరం జరిగింది. రామ్‌‌గర్ జిల్లాలోని సిక్కు రెజిమెంటల్ సెంటర్‌‌లో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఆర్మీ సిబ్బంది బుధవారం సరస్సులో మునిగి చనిపోయారు. శిక్షణలో భాగంగా ట్రైనీ సిబ్బందికి ఈతకొట్టడంలో శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు ట్రైనీలు ఈ ప్రమాదంలో చనిపోయినట్లు రామ్‌గర్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ తెలిపారు.

చనిపోయిన వారి మృతదేహాలను సరస్సు నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం సివిల్ అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించారు. ట్రైనీల మృతిని అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు రామ్‌గర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. శవపరీక్ష నిర్వహించిన తరువాత మృతదేహాలను తిరిగి ఆర్మీ అధికారులకు అప్పగించారు.

For More News..

యాక్సిడెంట్ అయిన వాళ్లను దగ్గరుండి ఆస్పత్రికి పంపిన బండి సంజయ్

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి