
కొందరు ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్ల వేషం వేసి.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తారు. ఒక్కోసారి రాద్దాంతం చేస్తారు. అనవసరంగా వివాదాలు సృష్టిస్తూ పబ్లిక్ ను ఇబ్బంది పెడతారు. ఇలాంటి ఘటనే జూన్ 27న జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర నడిరోడ్డుపై ట్రాన్స్ జెండర్లు హల్ చల్ చేశారు. ట్రాన్స్ జెండర్లు ఘర్షణకు దిగారు. జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాల మధ్య అడుక్కునే విషయంలో మొదలైన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒకరి నొకరు బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. ఒకరినొకరు దాడి చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డుపై ప్రజలను ఇబ్బంది పెట్టేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.