చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళల గల్లంతు

చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళల గల్లంతు

మెదక్ జిల్లా: చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ఇద్దరు మహిళల గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన అల్లాదుర్గం మండలం పరిధిలోని నీలకంటిపల్లిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లి    బసమ్మ, దుర్గమ్మ అనే ఇద్దరు మహిళల కోసం గాలింపు చేపట్టారు. బసమ్మ మృతదేహం కొద్దిసేపటి క్రితం దొరికింది. ఆమెతోపాటు వెళ్లిన దుర్గమ్మ మృత దేహం కోసం గాలిస్తున్నారు స్థానికులు.