గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ విషాద ఘటన కొండాపూర్ లో జరిగింది. గౌతమి ఎనక్లేవ్ లోని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్’ అనే ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. దాంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం అంజి (30), శ్రీను(32) అనే ఇద్దరు కూలీలు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా.. వారిద్దరూ ఊపిరాడక మృతిచెందారు. మృతులను సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీ చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ గ్రామంగా పోలీసులు తెలిపారు.
కొండాపూర్ లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు మృతి
- హైదరాబాద్
- November 28, 2021
లేటెస్ట్
- సేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
- జాతీయ విద్యా విధానంపై హైకోర్టులో పిల్
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం
- కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య
- దుండగులను కఠినంగా శిక్షించాలి : బక్కి వెంకటయ్య
- 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
- కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు
- ఫంగస్, క్యాట్ ఫిష్ లకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు
- ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్