కొండాపూర్ లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు మృతి

కొండాపూర్ లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు మృతి

గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ విషాద ఘటన కొండాపూర్ లో జరిగింది. గౌతమి ఎనక్లేవ్ లోని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్’ అనే ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. దాంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం అంజి (30), శ్రీను(32) అనే ఇద్దరు కూలీలు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా.. వారిద్దరూ ఊపిరాడక మృతిచెందారు. మృతులను సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీ చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ గ్రామంగా పోలీసులు తెలిపారు.