పార్సిల్ మాయం చేసి.. బూతులు తిట్టిన ఉబెర్ బైక్​ రైడర్

పార్సిల్ మాయం చేసి.. బూతులు తిట్టిన ఉబెర్ బైక్​ రైడర్

మాదాపూర్​, వెలుగు : ఉబెర్ ద్వారా పంపిన పార్సిల్​ను బైక్​ రైడర్​ మాయం చేసిన ఘటన మాదాపూర్​ పీఎస్ పరిధిలో జరిగింది. హైటెక్ సిటీ మాదాపూర్ ​అయ్యప్ప సొసైటీ పరిధి వీఐపీ హిల్స్​లో ఉండే జి. వీరేశ్ ​మంగళవారం ఉదయం మాదాపూర్​ పత్రికానగర్​లోని ఓ హాస్టల్​లో ఉండే తన సోదరికి ఫుడ్​, బుక్స్​ను ఉబెర్ బైక్​ బుక్ ​చేసి పంపించాడు. బైక్​ రైడర్​ అభిలాష్​ కొద్ది దూరం వెళ్లగానే రైడ్​ను క్యాన్సిల్​చేశాడు. అతనికి వీరేశ్ ​కాల్​చేయగా రెస్పాన్స్​ ఇవ్వలేదు. 

దీంతో ​ఉబెర్ యాప్​లో కంప్లయింట్ చేయగా రైడర్ ​ఫోన్ ​నంబర్  సంస్థ ఇచ్చి పర్సనల్ గా మాట్లాడుకోమని చెప్పింది. బుధవారం ఉదయం వీరేశ్​మళ్లీ అభిలాష్​కు కాల్​ చేయగా పోలీసులకు చెప్పుకోండి అంటూ.. బూతులు తిడుతూ వాట్సప్​లో మెసేజ్​ పెట్టాడు.  దీంతో  బాధితుడు వీరేశ్ ​మాదాపూర్​ పోలీసులను కంప్లయింట్ చేశాడు. తన వస్తువులు తనకు ఇప్పించి ఉబెర్​ బైక్​ రైడర్​పై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ లో కోరగా.. మాదాపూర్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.