మాదాపూర్, వెలుగు : ఉబెర్ ద్వారా పంపిన పార్సిల్ను బైక్ రైడర్ మాయం చేసిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. హైటెక్ సిటీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పరిధి వీఐపీ హిల్స్లో ఉండే జి. వీరేశ్ మంగళవారం ఉదయం మాదాపూర్ పత్రికానగర్లోని ఓ హాస్టల్లో ఉండే తన సోదరికి ఫుడ్, బుక్స్ను ఉబెర్ బైక్ బుక్ చేసి పంపించాడు. బైక్ రైడర్ అభిలాష్ కొద్ది దూరం వెళ్లగానే రైడ్ను క్యాన్సిల్చేశాడు. అతనికి వీరేశ్ కాల్చేయగా రెస్పాన్స్ ఇవ్వలేదు.
దీంతో ఉబెర్ యాప్లో కంప్లయింట్ చేయగా రైడర్ ఫోన్ నంబర్ సంస్థ ఇచ్చి పర్సనల్ గా మాట్లాడుకోమని చెప్పింది. బుధవారం ఉదయం వీరేశ్మళ్లీ అభిలాష్కు కాల్ చేయగా పోలీసులకు చెప్పుకోండి అంటూ.. బూతులు తిడుతూ వాట్సప్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితుడు వీరేశ్ మాదాపూర్ పోలీసులను కంప్లయింట్ చేశాడు. తన వస్తువులు తనకు ఇప్పించి ఉబెర్ బైక్ రైడర్పై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ లో కోరగా.. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.