హిజాబ్ ధరిస్తే క్లాస్ రూంలోకి నో ఎంట్రీ

 హిజాబ్ ధరిస్తే క్లాస్ రూంలోకి నో ఎంట్రీ

ఉడుపి: కర్నాటక రాష్ట్రం ఉడుపి గవర్నమెంట్ పీయూ కాలేజ్ ప్రిన్సిపాల్ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. హిజాబ్ ధరిస్తే క్లాస్ రూంలోకి నో ఎంట్రీ అని ప్రిన్సిపాల్ రుద్ర గౌడ హుకూం జారీ చేశారు. ఉర్దూ, అరబిక్ భాషల్లో కూడా మాట్లాడొద్దని ఆదేశించారు. దీంతో ఆరుగురు స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. క్లాసెస్ బాయ్​కాట్ చేసి క్లాస్​రూం బయటే నిలబడి నిరసన తెలిపారు. పేరెంట్స్​కు విషయం చెప్పగా.. వారు ప్రిన్సిపాల్​తో మాట్లాడేందుకు ట్రై చేసినా.. అనుమతించట్లేదని ఆరోపించారు. దీంతో స్థానిక మీడియా ప్రతినిధులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా క్లాసులకు అటెండ్ అవ్వకపోవడంతో అటెండెన్స్ పర్సెంటేజీ పడిపోతుందని.. వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు.