మే 5న రిలీజ్ కానున్న ‘ఉగ్రం’

మే 5న రిలీజ్ కానున్న  ‘ఉగ్రం’

‘నాంది’ లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లరి నరేష్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌ కనకమేడల కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతోన్న రెండో  చిత్రం ‘ఉగ్రం’. మిర్నా మీనన్ హీరోయిన్.  సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కి యంగ్ హీరోలు నిఖిల్, అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వశిష్ట, శివ నిర్వాణ, విఐ ఆనంద్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేస్తూ టీమ్‌‌‌‌‌‌‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. నరేష్ మాట్లాడుతూ ‘ఇది నా 60వ సినిమా. విజయ్, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే ‘నాంది’కి మించి ఉండాలని భావించాం.

ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పటి వరకు ‘కితకితలు’ పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్ చేశాను. కానీ ఇందులో ఉగ్ర రూపం చూడబోతున్నారు. ఇంటెన్స్ నరేష్‌‌‌‌‌‌‌‌ని చూస్తారు’ అని చెప్పాడు. ‘నాంది’ని ఇష్టపడిన వారంతా ‘ఉగ్రం’ని కూడా ఇష్టపడతారంది మిర్నా మీనన్. ఇందులోని యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులకు నచ్చుతాయన్నాడు విజయ్. నరేష్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్నారు నిర్మాతలు.  టీమ్ అంతా పాల్గొన్నారు.